అందరూ ఎంతో ప్రతిష్టాత్మకం గా ఎదురు చూస్తూ వచ్చిన ఎస్వీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ అనుకోని కారణాల వలన వాయిదా పడింది. ఈ ఈవెంట్ నిర్వాహకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుక ని జరపాలని తలచారు కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది వాయిదా పడటం జరిగింది. అయితే ఈ ఈవెంట్ ఇంక ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం పైన మాత్రం ప్రస్తుతం క్లారిటీ లేకుండా పోయింది.
ఇకపోతే విశ్వ నట చక్రవర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని తాడేపల్లి గూడెం యస్.వి.ఆర్. సర్కిల్, కె.యన్.రోడ్ లో ఈ నెల 25 అనగా రేపు ఆదివారం నాడు ఆవిష్కరించేందుకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి అతిథుల ని కూడా పిలిచేసారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. చిరంజీవి వస్తున్నారని తెలిసి చాలా మంది అభిమానులు కూడా ఈ వేడుక కి హాజరు కావాలని ఆశపడినట్లు మనకు అర్థం అవుతుంది.
అయితే ఈ ఆవిష్కరణ కారణాంతరాన వాయిదా వేశామని నిర్వాహకులు అధికారికం గా నే తెలిపారు. విగ్రహావిష్కరణకు ప్రభుత్వం నుండి అనుమతులు ఇంకా మంజూరు కాని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది అని తెలిపారు.