Monday, April 29, 2024
- Advertisement -

16 ఏళ్ల బాలిక‌పై 51 రోజులుగా అత్యాచారం చేసిన కామాంధులు

- Advertisement -

మైన‌ర్ బాలిక‌ల‌పై అత్యాచారాలకు అడ్డుక‌ట్ట ప‌డ‌టంలేదు. ప్ర‌తీ రోజు ఎక్క‌డో ఒక చోటు ఇలాంటి అఘాయిత్యాలు జ‌రుగుతూనె ఉన్నాయి. తాజాగా ఆలాంటి సంఘ‌ట‌నె చోటు చేసుకుంది. మైన‌ర్ బాలిక‌పై సభ్యసమాజం తలదించుకునేలా కామాంధులు రెచ్చిపోయారు. ప‌క్కింటి వాళ్ల‌ను న‌మ్మినందుకు ఆ మైన‌ర్ బాలిక‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు. ఆమెను కిడ్నాప్‌ చేసి 51 రోజుల పాటు నరకం చూపించారు. బాలిక అని కూడా చూడకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈసంఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది.

చివరకు ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది. వివ‌రాల్లోకి వెల్తే…బాలిక తండ్రి నోయిడా సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. బాలికకు చదువు రాదు. ఇంటి వద్దే ఉంటూ చిన్న చితక పనులు చేస్తుండేది. రెండు నెలల క్రితం వారి ఇంటికి సమీపంలో మధ్యప్రదేశ్‌కు చెందిన చోటు, యూపీకి చెందిన సురాజ్‌లు అద్దెకు వచ్చారు.

మొద‌ట బాలికు స్నేహం పెంచుకున్నారు.మార్చి 2వ తేదీన ఇంట్లో ఉన్న బాలికను ఇద్దరు కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత ఆమెను ఓ గదిలో నిర్బంధించారు. ఇక నాటి నుంచి ఏప్రిల్‌ 22 వరకు ఆమెపై ఆ ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. వేధింపులకు గురి చేస్తూ హింసించారు. ఇక్కడి నుంచి తప్పించుకుపోతే చంపేస్తామని బెదిరించారు.

ఏప్రిల్‌ 22న బాలిక ఆ గది నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -