Saturday, May 18, 2024
- Advertisement -

టీడీపీ వాళ్లను విజయసాయి రెడ్డి అంత మాట అన్నాడేంటి!

- Advertisement -

తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ధ్వజమెత్తడం కొత్తేమీ కాదు.. ఈ రెండు పార్టీలూ మొదటి నుంచి ఉప్పూనిప్పులే.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు గట్టిగానే జరిగింది.

ఇక ఎన్నికల తర్వాత తెలుగుదేశం అధికారంలోకి రావడం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావడంతో ఈ రెండు పార్టీల మధ్యనా పోరాటం మరింతగా పెరిగింది. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం అధికారంలో ఉండగా, వైకాపాప్రతిపక్షంలో ఉంటూ తీవ్రంగానే పోరాడుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో వైకాపా నేతలు తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీ ఆగడాలను సహించం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద.. ఇతర తెలుగుదేశం నేతల మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం వారు కూడా వైకాపా మీద విరుచుకుపడుతున్నారు. తెలుగుదేశం వాళ్లు అయితే జగన్ ను లక్ష్యంగా చేసుకొని.. ఓదార్పు యాత్రలో జగన్ మోహన్ రెడ్డికి ఏమైనా జరగవచ్చు జాగ్రత్త.. అని కూడా అనేశారు!

ఇలాంటి నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకుపడ్డాడు. ఏకంగా తెలుగుదేశం నేతలను తీవ్ర పదాలతో దూషించాడు. తెలుగుదేశం ఊరకుక్కల ఆగడాలను సహించలేం.. అని విజయసాయిరెడ్డి అన్నాడు. తెలుగుదేశం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఊరకుక్కల్లా అందరి మీదా పడుతున్నారని.. ఇప్పుడు వీరు తప్పించుకోవచ్చునేమో కానీ.. భవిష్యత్తులో మాత్రం వీరికి తగిన శాస్తి జరుగుతుందని విజయసాయిరెడ్డి హెచ్చరించాడు. అంటే.. జగన్ అధికారంలోకి వచ్చాకా.. ఇప్పుడు తెలుగుదేశం నేతలు చేస్తున్న నేరాలపై విచారణ జరిపిస్తాం.. అనేది విజయసాయిరెడ్డి హెచ్చరిక కాబోలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -