Saturday, April 20, 2024
- Advertisement -

సిపిఎం కార్యకర్త మృతి.. ఇద్దరికి గాయాలు

- Advertisement -

పశ్చిమ  బెంగాల్ లో జరుగుతున్న మూడో విడత ఎన్నిక్లలో హింస చోటుచేసుకుంది. బుర్ద్వాన్ జిల్లా కేటుగ్రాం పోలింగ్ కేంద్రంపై నాటుబాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో సిపిఎంకు చెందిన ఒక కార్యకర్త మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడో విడతలో 62 నియోజకవర్గాల్లో  పోలింగ్ జరుగుతోంది. ఇక్కడి నుంచి 418 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 16 వేల పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.

ఇక్కడ 1.32 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకూ కొనసాగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -