గోవాలో జరిగిన ఓ భయానక ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సముద్రంపై పారాసైలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కేబుల్ తెగిపోవడంతో ఒక పర్యాటకుడు అరేబియా సముద్రంలో పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదృష్టవశాత్తూ బోట్ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటన గోవాలోని బాగా బీచ్ వద్ద చోటుచేసుకుంది. ఈ సంఘటనతో భారత్లో అడ్వెంచర్ టూరిజం భద్రతపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇది కేవలం థ్రిల్ మాత్రమేనా? లేక ప్రమాదకరమైన వ్యవస్థగా మారుతోందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
గత ఏడాదిలో కూడా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గోవాలోనే ఒక యువతి, ఆమె ఇన్స్ట్రక్టర్ పారా గ్లైడింగ్ ప్రమాదంలో మరణించారు. అలాగే Tehri Lakeలో ఒక శిక్షణార్థి పారా గ్లైడింగ్ సమయంలో నీటిలో పడిపోయి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇంకా Indrunagలో టేకాఫ్ సమయంలో గ్లైడర్ సరిగా ఎగరకపోవడంతో ఒక పర్యాటకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలు అడ్వెంచర్ స్పోర్ట్స్ రంగంలో ఉన్న లోపాలను బయటపెడుతున్నాయి.
