Saturday, April 27, 2024
- Advertisement -

డిగ్రీ విద్యార్థిని భార్గవిపై దాడి కేసులో వెలుగులోకి కొత్త కోణం…

- Advertisement -

విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో డిగ్రీ విద్యార్థిని భార్గవిపై దాడి కేసులో కొత్త కోనం వెలుగులోకి వచ్చింది. భార్గవితో పాటు మరో వ్యక్తిని హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.భర్గవి స్నేహితుడు మన్సూర్‌ను చంపి.. ఆ తర్వాత భార్గవి పై దాడి చేసేందుకు స్కెచ్ వేశాడు. మన్సూర్ మిస్ కావడంతో భార్గవి మెడ పై కత్తితో దాడి చేశాడు. బాధితురాలు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

స్థానికులు చెబుతున్న ప్రకారం భార్గవిని సాయి ప్రేమిస్తున్నాడని ఆ విషయం పెద్దలకు తెలియడంతో భార్గవి మైనర్ కావడంతో రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని నిర్ణయించారట. తర్వాత ఆమె క్లాస్‌మేట్స్‌తో చనువుగా ఉండటాన్ని చూసి సాయి తట్టుకోలేకపోయాడు.భార్గవిపై కోపం పెంచుకున్న సాయి ఆమెతో చనువుగా ఉంటున్న మన్సూర్ ను చంపేందుకు ప్లాన్ వేశారు. ప్లాన్ బెడిసి కొట్టడంతో మన్సూర్ మిస్ కావడంతో భార్గవి మెడ పై కత్తితో దాడి చేశాడు.బాధితురాలు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సాయి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసుల విచారణలో మాన్సూర్ హత్యకు సంబంధించి ప్లాన్ బయటపడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -