- Advertisement -
టెలికాం సంస్థ వొడాఫోన్ తన వినియోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. వోడాఫోన్ సంస్థ పలు అన్ లిమిటెడ్ రీఛార్జ్ ప్యాక్ లపై వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ రూ.50 విలువ గల వోచర్ల రూపంలో లభించనున్నాయి.
రూ.399, రూ.458, రూ.509 ప్యాక్లను రీచార్జి చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ప్యాక్లను మై వొడాఫోన్ యాప్ ద్వారా రీచార్జి చేసుకున్న కస్టమర్లకు నిర్దిష్ట సంఖ్యలో వోచర్లు వస్తాయి. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. వాటిని తదుపరి చేసుకునే రీచార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్ను పొందవచ్చు. ఒకసారి మాత్రమే ఉపయోగించుకునే ఈ ఆఫర్ కొత్త వోడాఫోన్ వినియోగదారులకి మాత్రం లభించదు.