Friday, May 17, 2024
- Advertisement -

బాబుపై హత్యాయత్నం.. ఒక సానుభూతి ప్రయత్నమా?!

- Advertisement -

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుపై హత్యాయత్నం అంటూ హడావుడి జరుగుతోంది.

మొదటి రోజు సింగిల్ కాలమ్ గా ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చిన మీడియా.. ఇప్పుడు క్రమంగా దాన్నే కొండంత చూపుతోంది. బాబును వేసేయడానికి ఎర్ర చందనం స్మగ్లర్లు ప్రయత్నించారని.. రెక్కీ నిర్వహించారని.. కథనాలు, విశ్లేషణలు మొదలు పెట్టారు. ఇది అంతర్జాతీయ స్థాయి కుట్ర.. దుబాయ్ లోని ఒక డాన్ దీని వెనుక ఉన్నాడు.. అంటూ మరింత రచ్చ చేస్తున్నారు!
మరి ఇదంతా నిజమా.. అంటే ధ్రువీకరణ లేదు. బాబు అనుకూల మీడియా మాత్రం ఈ వ్యవహారాన్ని బాగానే ఉపయోగించుకొంటోంది. బాబు ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించాడని..అందుకే వాళ్లంతా ఇప్పుడు బాబును చంపడానికి ప్రయత్నిస్తున్నారని అంటూ చంద్రబాబుపై సానుభూతిని క్రియేట్ చేయడానికి మీడియా ప్రయత్నాలు చేస్తోంది.
ఎర్రచందనం కూలీలను దారుణంగా హతమార్చడం తప్ప.. ఇంత వరకూ బాబు ప్రభుత్వం స్మగ్లర్ల ఆటకట్టించింది అయితే లేదు. గతంలో తెలుగుదేశం పార్టీకి వైరి పక్షంలో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లు దున్నేస్తే.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలురైన స్మగ్లర్లు రాజ్యం ఏలుతున్నారని.. వార్తలు వస్తున్నాయి. ఇలా స్మగ్లించే చేసే వ్యక్తులు మారడం తప్ప.. స్మగ్లింగ్ అయితే ఆగింది లేదని శేషాచలం ప్రాంత ఎర్రచందనం గుట్లూ మట్లు తెలిసిన వారు చెబుతున్నారు.
అయితే ఏదో సిల్లీ వార్తను పట్టుకొని.. ఎర్రచందనం స్మగ్లర్లు బాబును చంపడానికి ప్రయత్నిస్తున్నారని.. వార్తలు రాసి మీడియా హడావుడి చేస్తోందని.. ఇదంతా బాబుపై సానుభూతి తెచ్చిపెట్టే ప్రయత్నామేనని వారు అంటున్నారు. మరి అసలు విషయం ఏమిటో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -