Friday, May 17, 2024
- Advertisement -

జగన్ జోస్యం ఫలించేది ఎప్పుడు ?

- Advertisement -

“తెలుగు దేశం పార్టీ త్వరలో అధికారం కోల్పోయే పరిస్థితి ఉంది, త్వరలో వై ఎస్ తరహా పరిపాలన రావడానికి సిద్దం గా ఉంది, చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవడానికి రెడీ ” అంటూ అప్పుడప్పుడూ తనదైన శైలి లో జోస్యం చెబుతూ ఉంటారు జగన్ మోహన్ రెడ్డి. తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉండేది కాదు అంటూ తన లెక్కలేవో తనకి ఉన్నాయి అన్నట్టు చెబుతారు ఆయన

తాము అధికారంలోకి త్వరలో రాబోతున్నాం అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది ఎలాగా ఏ రకమైన చాన్స్ లు ఉన్నాయి అనేది మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడరు జగన్. వై ఎస్ జగన్ ధీమా వెనక ఎలాంటి కథ ఉందో తెలీదు కానీ. జగన్ చెప్పింది జరగాలి ఆటే మాత్రం బీజేపీ – తెలుగుదేశం ల మధ్య మైత్రీ బంధం కోల్పోవాలి.

ఇప్పటికే బీటలు వారిన ఈ బంధాన్ని చంద్రబాబు ఒక పక్కా – వెంకయ్య నాయుడు ఒక పక్కా కూలిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు.ఒక వేళ బీజేపీ తెలుగుదేశం ని పోమ్మనచ్చు గానీ   బీజేపీని తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టే అవకాశాలే లేవు. వచ్చే మూడున్నరేళ్ళలో టీడీపీని బీజేపీ వదిలించుకుంటుందా.? అంటే అదీ మిలియన్డాలర్ల ప్రశ్నే.

 చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ళ కాలం లో ఎలాంటి హోదాలూ గట్రా ఇవ్వకపోయినా కూడా పూర్తి అధికారం తో బీజేపీ తమ రాష్ట్రానికి మంచి చేసింది అనే కలరింగ్ ఇవ్వడంలో సిద్ద హస్తులు సో బీజేపీ ఎలాంటి ఇబ్బందీ లేదు. కావున ఈ దగ్గరలో జగన్ మోహన్ రెడ్డి జోస్యం ఫలించే అవకాశాలైతే కనపడ్డం లేదు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -