Saturday, May 11, 2024
- Advertisement -

కండోమ్ ప్రకటనలు ఎందుకు వద్దు?

- Advertisement -

కండోమ్ ల ప్రకటనలపై కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. టీవీల్లో కండోమ్ ప్రకటనలను రాత్రి 10 తర్వాతే ప్రసారం చేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ డిసెంబర్11న అన్ని టీవీ చానళ్లకు సూచించింది. ఈ ఆదేశాలపై న్యాయస్థానం కొత్త సందేహం వ్యక్తం చేసింది. ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి 10 గంటల మధ్య టీవీల్లో కండోమ్ ప్రకటనల ప్రసారంపై నిషేధం విధించడానికి కారణాలేంటని రాజస్థాన్ హైకోర్టు ప్రశ్నించింది. ఈమేరకు వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు మాత్రమే కండోమ్ యాడ్స్ ను టీవీల్లో ప్రసారం చేయాలని ఆదేశాలిచ్చింది.

కండోమ్ పై టీవీల్లో వస్తున్న వాణిజ్య ప్రకటనలపై మహారాష్ట్ర మహిళా కమిషన్ సమీక్షించి విషయాన్ని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి తెచ్చింది. సన్నీలియోన్ కండోమ్ వాణిజ్య ప్రకటన గురించి ఇందులో ప్రధానంగా నొక్కిచెప్పింది. దీంతో కండోమ్ యాడ్స్ ను కేవలం రాత్రి సమయంలోనే అనుమతించాలని సూచించింది. అయితే ఈ ఆదేశాలపై ఓ స్వచ్ఛంద సంస్థ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఓవైపు కుటుంబ నియంత్రణపై ప్రచారం చేస్తూనే మరోవైపు కండోమ్ ప్రకటనలపై పరిమితులు విధించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమంటూ ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన రాజస్థాన్ హైకోర్టు కేంద్రం నిర్ణయం వెనుక సహేతుకమైన కారణమేంటని ప్రశ్నించింది. ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి 10 గంటల మధ్య టీవీల్లో కండోమ్ ప్రకటనల ప్రసారంపై నిషేధం విధించడానికి కారణాలేంటని ప్రశ్నిస్తూ ఈ మేరకు వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సన్నీలియోన్ నటించిన కండోమ్ యాడ్ గురించి గోవా అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిగిన సంగతి తెలిసిందే. సన్నీలియోన్ యాడ్ పై సభలో దుమారం రేగింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -