ఇతరుల నొప్పి…. వారి దాక వచ్చే దాక తెలియదు టీడీపీ నాయకులు పరిస్థితి. ఏపీలోని పచ్చపార్టీ నేతలే టార్గెట్గా జరుగుతున్న దాడులపై పార్టీ నేతలు తెగ గొంతు చించుకుంటున్నారు. సానుభూతి కోసం ప్రజలకు అంటగట్టేలా బీద అరుపులు అరుస్తున్నారు. అదే దో బాబును జైల్లో పెట్టినట్లు తెగ హాడావుడి చేస్తున్నారు. కొందరి టీడీపీ నాయకుల మీద ఐటీ దాడులు జరిగే దాన్ని ప్రజలందరికీ అంటగడుతూ చిల్లర రాజకీయీలు చేస్తున్నారు.
ఇతర పార్టీ నాయకుల మీద ఇలాంటి దాడులు జరిగితే సక్రమం, అదే టీడీపీ నేతలపై జరిగితే కుట్ర…ఇదెక్కడి పచ్చపైత్యం. గతంలో జగన్మీద కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యి కేసులు పెట్టినప్పుడు సంబరాలు చేసుకున్న బాబు అండ్ కో ఇప్పుడు వారి పార్టీ నాయకులపై ఐటీ దాడులు జరిగితే తెగ గింజుకుంటున్నారు.
ఇక బాబు అస్థానమీడియా, ఆయన సానుభూతి పరులు అయితే బాబుకు తెగ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును ఎవరు ఏం అన్నా సరే.. అందుకు తెలుగుజాతి మొత్తం అండగా నిలవాలంటూ వారు పిలుపు ఇస్తున్నారు. గతంలో నాపై దాడులు చేస్తున్నారని నాకు తెలుగు ప్రజలందరు అండగా ఉండాలని ముసల కన్నీళ్లు కార్చిన బాబు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు.
ఐటీ దాడుల నేపథ్యంలో అత్యవసరంగా అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ బాబుపై చేసిన వ్యాఖ్యలు, ఐటీ దాడులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక బాబు అండ్కో అయితే పట్ట పగ్గాల్లేకుండా భాజాపాపై విమర్శలు చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా తామేదో నీతి వంతులమయినట్లు సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారు. ఎల్లో మీడియా బాబుతో పాటు టీడీపీ నాయకులమీద ఈగ వాలకుండా సొంత డబ్బా కొట్టుడం రోజూ చూస్తున్నాం.