సమాజంలో రోజు రోజుకు మహిళలపై వరకట్న వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా వరకట్న దాహానికి మరో యువతి బలైంది. భర్త, అత్త మామలు అదనపు కట్నం తేవాలని వారి డిమాండ్లను భరించలేకపోయింది. పెళ్లి చేసుకున్న మహిళ తన భర్త, అత్తమామలు చికెన్ తినాలని బలవంతం చేయడంతో వేరే గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెల్తే సంగారెడ్డి జిల్లాకి చెందిన జి. పాండురంగ రెడ్డి కుమార్తె స్వేతను…వికారాబాద్ జిల్లా సిరిపురంకు చెందిన మర్రి చెన్నారెడ్డికి ఇచ్చి ఏడాది క్రితం పెల్లి చేశారు. పెల్లి సమయంలో ఆమె తల్లి దండ్రులు రూ .4 లక్షల నగదు మరియు 10 తులాలు బంగారు ఇచ్చారు.
పెళ్లైన కొద్దిరోజుల నుంచి అదనపు కట్నం కోసం స్వేత భర్త, అత్తమామలులు వేధించడం మొదలు పెట్టారని ఆమె తండ్రి పాండురంగా రెడ్డి చెప్పారు. వారి డిమాండ్లను ఆమె తల్లి దండ్రులకు చెప్పినపుడు అదనపు కట్నం ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. అయితె దీనికి కొంత సమయం కావాలని తల్లిదండ్రులు చెప్పారు. పెల్లికి ముందు తమ కుమార్తె శాఖాహారి అని తెలిపారు. అదనపు కట్నం కోసం వేధించేవారని…బలవంతంగా మాంసం తినడానికి ఫోర్స్ చేయడంతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందన్నారు.
ఈ జంట 20 రోజులకు ముందు, మియాపూర్లోని FCI కాలనీలో అద్దెకు తీసుకున్న ఇంటిలోకి ప్రవేశించారు. శ్వేత శరీరం వేలాడతుండటంతో ఇంటి ఓనర్ గమనించి పోలీసులకు అమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అమె తల్లి దండ్రుల ఫిర్యాదు ఆధారంగా స్వేత భర్త, అత్త,మామలపై పోలీసులు కేసునమోదు చేశారు.