Saturday, May 4, 2024
- Advertisement -

ఫేస్‌బుక్ మాయ‌లేడీ..యువ సాప్ట్ వేర్ ఇంజినీర్‌కు చుక్క‌లు చూపించింది

- Advertisement -
Women Cheated In Software Engineer Facebook

దేశంలో ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉండని  వారుండ‌రు. ప్ర‌తీ రోజూ మోసాలు జ‌రుగుతూనే ఉన్నాయి. అయినా కూడా మొస‌పోతూనే ఉన్నారు. అది కూడా చ‌దువుకోని వాల్ల‌యితే ఏదో తెలియ‌దు అన‌కుంటాం కానీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే మోస‌పోతే …. అమ్మాయ‌ల‌నుంచి  ప్రెండ్ రిక్వ‌ష్ట్ వ‌స్తే   చాలు అది ఎద‌రూ అని ఆలోచించ‌కుండా ఓకే చేస్తాం. త‌ర్వాత దాని ప‌ర్యావ‌స‌నాలు ఎలా ఉంటాయంటే దానికి ఉదాహ‌ర‌న ఈసాప్ట్‌వేర్ ఇంచ‌నీర్‌కు జ‌రిగిని ఉందంతం.

మూడు నెల‌ల క్రితం ఫేస్‌బుక్‌లో  వ‌చ్చిన  ఫ్రెండ్ రిక్వెస్ట్‌కు అంగీక‌రించిన యువ‌కుడికి  అ అమ్మాయి  చుక్క‌లు చూపించింది.వివరాల్లోకి వెల్తే  ప్ర‌కాశం జిల్లా చీరాల మండ‌లం ఈపూరానికి చెందిన వింజ‌మూరి సురేష్ కుమార్ హైద‌రాబాద్‌లో  ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

జనవరిలో తన ఫేస్‌బుక్‌కు ఓ యువతి చల్లా పల్లవి అనే పేరుతో, ప్రొఫైల్‌ పిక్చర్‌లో మలయాళ హీరోయిన్‌ ఫొటో పెట్టి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపింది. రిక్వెస్ట్‌ను సురేశ్‌ అంగీకరించి ఫోన్‌ నంబర్లు మార్చుకున్నారు. వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసుకున్నారు. అంతా బాగానే ఉంది త‌ర్వాత మొద‌లైంది అస‌లు క‌థ‌.

ఇన్ఫోసిస్‌లో జావా డెవ‌ల‌ప‌ర్ టీం లీడ‌ర్‌గా ప‌నిచేస్తున్నాని ప‌రిచ‌యంచేసుకంది. త‌న తండ్రి ఒంగోలులో డీఎస్పీగా ప‌నిచేస్తున్నాడ‌ని అయ‌న పోన్ నెంబ‌ర్ ఇచ్చిది.త‌న అస‌లు పేరు మౌనిక‌ని …. సొంతూరు చీరాల కొత్త‌పేట‌ని చెప్పి ప్రేమిస్తున్నాన‌ని చెప్ప‌డంతో ప్రేమ‌ను అంగీక‌రించాడు.అక్క‌డ మొద‌ల‌య్యింది వ్య‌వ‌హారం. ఒక రోజు మ‌న ప్రేమ‌ను మా నాన్న అంగీక‌రించ‌డంలేద‌ని నిద్ర‌మాత్ర‌లు మింగాన‌ని చెప్పింది.త‌ర్వాత మూడురోజుల త‌ర్వాత మౌనికి …. సురేశ్‌కు పోన్ చేసి త‌న బావ‌తో ఇష్టంలేని  పెళ్లి చేస్తున్నార‌నీ హైద‌రాబాద్‌లో ఓహోట‌ల్‌లో ఉన్నాన‌ని వ‌చ్చి క‌ల‌వ‌మంది.దీంతో సురేశ్ అక్క‌డికి వెల్లాడు.

హోట‌ల్‌కు వెల్ల‌గానే  అక్క‌డ  పెద్ద వయసు ఉన్న ఓ మహిళ తాను మౌనికగా పరిచయం చేసుకుంది. దీంతో విషయం అర్థమైన సురేశ్‌ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించినా వీలు కాలేదు..గది తలుపులు మూసేసి ఇక్కడి నుంచి వెళ్తే మీ కుటుంబమంతా జైలుకెళ్తుందని బెదిరించి దండలు మార్పించింది. సురేశ్‌ బంధువులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. మౌనికను, ఆమె నాయనమ్మ అని చెప్పుకుంటున్న వృద్ధురాలిని తీసుకుని విజయవాడ రైల్లో బయలుదేరారు. మధ్యలో సురేశ్‌ బంధువులు వచ్చి వారిని అడ్డుకోవడంతో.. అక్కడి నుంచి మౌనిక, వృద్ధురాలు పారిపోయారు.

త‌రువాత విచారణ చేయగా అసలు ఆమె పేరు మౌనిక కాదని.. ఉయ్యాల కనక మహాలక్ష్మి (35) అని, అనేక కేసుల్లో నిందితురాలని తేలింది. ఆమెకు పెళ్లై భర్త చనిపోయి ఇద్దరు పిల్లలున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం సురేశ్‌ తనను పెళ్లి చేసుకుని మోసం చేసి కులం పేరుతో దూషించాడని కనకమహాలక్ష్మి ఈపూరుపాలెం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితుడు కూడా ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. దొంగతనాలు, చైన్‌స్నాచింగ్, చీటింగ్‌లో ఆమె ముద్దాయి. ఆమెపై తిరుపతి సీసీఎస్, క్రైం, నార్కెట్‌పల్లి పీస్‌లో అరెస్టు వారెంట్, కందుకూరులో అనుమానాస్పదురాలిగా కేసులున్నాయి. ఈ కేసు నుంచి నువ్వు బయట పడాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని కూడా బెదించిందని బాధితుడు వాపోయాడు. చూశారుగా మాయ‌లేడి మొసం. ఇది చూసైనా  మేలుకుంటే మంచిది. తెలియ‌ని వారినుంచి ఫ్రెండ్ రిక్వెష్ట్ పంపుతే జాగ్ర‌త్త‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -