Monday, April 29, 2024
- Advertisement -

భారత జట్టుపై బాలీవుడ్‌ నటుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..ఘాటుగా కౌంట‌ర్ ఇస్తున్న నెటిజ‌న్లు

- Advertisement -

మే30 నుంచి ఇంగ్లండు వేదిక‌గా జ‌రిగే మెగా టోర్నీ ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. భార‌త జ‌ట్టుపై కొంద‌రు స్వాగ‌తిస్తుండ‌గా మ‌రి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అనుభ‌వానికే సెల‌క్ట‌ర్ల క‌మిటీ పెద్ద పీట వేసిన‌ట్లు జ‌ట్టు కూర్పును బ‌ట్టి తెలుస్తోంది. అయితే తాజాగా భార‌త జ‌ట్టుపై బాలీవుడ్ స్టార్ న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచకప్‌కు సెలక్ట్‌ అయిన 15 మంది ఆటగాళ్ల ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి, ఎందుకు ఎక్కువమంది గడ్డంతో ఉన్నారు అంటూ కామెంట్‌ పెట్టారు. అందరూ సామ్సన్‌లా? అంటూ సెటైర్‌ వేశారు. గడ్డంలేకుండా ఉంటే అందంగా, చురుగ్గా ఉంటారని, ఇది కేవలం తాను గమనించిన విషయం మాత్రమేనంటూ ట్వీట్‌ చేశారు.

రిష్ క‌పూర్ ట్విట్‌ల‌కు అంతే రీతిలో నెటిజన్లు బ‌దులిస్తున్నారు.మీ కుమారుడు కూడా గడ్డం పెంచుతూ కనబడుతుంటాడుగా అందుకే వీళ్లు కూడా పెంచి ఉంటారు. ముందుగా మీ కుమారుడు ఎందుకు గడ్డంపెంచుకుని తిరుగుతున్నాడో కనుక్కో అంటూ ఓ నెటిజన్‌ అంటే.. జట్టుకు జిల్లెట్‌ కంపెనీనీ స్పాన్సర్‌ చేయమంటే ఖచ్చితంగా వర్క్‌ అవుట్‌ అవుతుందని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

ప్రపంచకప్‌కు భారత్‌ తరపున విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, కేఎల్‌ రాహుల్, విజయ్ శంకర్, ఎంఎస్‌ ధోని, కేదార్‌ జాదవ్, దినేశ్‌ కార్తీక్‌, చహల్, కుల్దీప్, భువనేశ్వర్‌, బుమ్రా, హర్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహమ్మద్‌ షమీలు ఆడనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -