భారత ఆర్మీ ఛీప్ బిపిన్ రావత్కు కేంద్ర మంత్రులతో పాటు పలువురు ఎంపీలు నివాళులు అర్పించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భారత త్రివిద దళాదిపతి చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.
తన శరీరంలో తూటా ఉన్న బెదరకుండా ముందుకు వెళ్లిన వ్యక్తి బీపిన్ రావత్ అని ఆయన అన్నారు. బీపీన్ రావత్ తండ్రి కూడా ఆర్మీలో విధులు నిర్వర్తించారని ఎంపీ తెలిపారు. రావత్ దాదాపు భారత్ ఆర్మీలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహించారని, ఆయనకు ఉన్న ధైర్య సహాసాలతోనే కేంద్ర ప్రభుత్వం ఎవ్వరికీ ఇవ్వని త్రివిధ దళాదిపతి హోదాను బిపిన్ రావత్కు ఇచ్చిందన్నారు.
మరోవవైపు రావత్ మృతి ఆర్మీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్ప వచ్చు. పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ నిర్వర్తించడంలో కీలక పాత్ర పోషించిన రావత్ లాంటి ఇండియన్ వ్యక్తి ఆర్మీకి దొరకడం కష్టం. ఒక వేళ అలాంటి వారు దొరికినా.. వారికి త్రివిద దళాదిపతి హోదా కేంద్ర ఇవ్వడం కష్టంగానే భావించాలి. వీరిలో ఆర్మీ, ఎయిర్ఫోర్స్, జలంతర్గామి అధికారులను కలుపుకోనిపోయే మనస్తత్వం చాలా తక్కువ అని పలువురు మాజీ సైనికాధికారులు అంటున్నారు. దీంతో త్రివిద దళాదిపతి హోదా పొందిన మొదటి, చివరి వ్యక్తి బీపిన్ రావత్ అని చెప్పవచ్చు.