Saturday, May 4, 2024
- Advertisement -

“ఒరేయ్ పోట్టా భి” అన్న విజయసాయిరెడ్డి.. మీరు మారరు అంటూ నెటిజన్స్!

- Advertisement -

ఏపీలోని వైసీపీ, టిడిపి పార్టీల మద్య ఎప్పుడు కూడా పచ్చగట్టి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వేడి కొనసాగుతూ ఉంటుంది. ఇక రెండు ప్రధాన పార్టీల నేతలు చేసుకునే విమర్శలు ప్రతిసారి తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు మాట్లాడే భాష విధానంపై మొదటి నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. అయినప్పటికి ఆ పార్టీ నేతల భాష విధానంలో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తనదైన రీతిలో టిడిపి నేత పట్టాభి పై విమర్శలు గుప్పించారు.ఇటీవల డిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అధికార వైసీపీ నేతలపై ఆరోపణలు ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో ఇటీవల మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభిరామ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ బేగంపేట విమానాశ్రయాలనుంచి జగన్ తన ముఠా ద్వారా వందల కోట్ల నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని, డిల్లీ లిక్కర్ స్కామ్ కోణంలో ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పట్టాభిరామ్ తనదైన రీతిలో సి‌ఎం జగన్ పై ఆరోపణలు చేశారు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన వైసీపీ నేతలు పట్టాభిపై మాటలదాడి కి పాల్పడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ ” ఒరేయ్ ! పోట్టాభి నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియదురా… గతంలో ఇలా మాట్లాడే మాల్దీవులకు పారిపోయావ్.నీకు దున్నపోతులా దేవుడు శరీరాన్ని ఇచ్చాడు గాని ఆవగింజంతా మెదడును ఇవ్వడం మర్చిపోయాడురా ” అంటూ ట్వీట్ చేశారు. అయితే విజయ్ సాయి రెడ్డి మాట్లాడినా భాషపై నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక ఎంపీ హోదాలో ఉండి స్థాయి మరచి మాట్లాడుతున్నదని విజయసాయి రెడ్డి పై మండిపడుతున్నారు నెటిజన్స్. ముందు మీరు కరెక్ట్ గా మాట్లాడడం నేర్చుకొని ఆ తరువాత ఇతరులను విమర్శించండి అంటూ హితవు పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఏపీలో సింపతీ రాజకీయాలు.. ప్రజా మద్దతు ఎవరికి ?

ఇదే చివరి ఎలక్షన్..నిజమేనా ? వ్యూహమా ?

పవన్ స్కెచ్ లు జగన్ కు చుక్కలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -