ఐపీఎల్ 2024 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్కి చేరగా తాజాగా ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది లక్నో. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో చేధించింది లక్నో.
స్టాయినీస్ మారోసారి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్టాయినీస్ 62 పరుగులు చేయగా,కేఎల్ రాహుల్ (28),దీపక్ హుడా (18), నికోలస్ పూరన్ (14), అష్టన్ టర్నర్ 5 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీసుకోగా, నువాన్ తుషార, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ నబీ తలో వికెట్ తీసుకున్నారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసే లోపే టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలడంతో 100 పరుగులు అయినా చేస్తుందా అన్న సందేహం అందరిలో నెలకొంది. ఈ క్రమంలో నేహాల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35), ఇషాన్ కిషాన్ (32) పరుగులు చేయడంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్టాయినీస్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.