Saturday, May 4, 2024
- Advertisement -

ఉత్తరాంధ్రలో అల్లర్లకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నాడట!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రలో అల్లర్లకు భారీ స్కెచ్ వేస్తున్నాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో సంచలన ఆరోపణలు చేశారు. ” రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు స్కెచ్ వేశాడని, అమరావతినే రాజధానిగా అంగీకరించాలని ఉత్తరాంధ్ర లో ఘర్షణలు సృష్టించేందుకు బాబు చేస్తోన్న ప్లాన్ ప్లాప్ అయిందని, కర్నూల్ వెళ్ళి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశాడని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మీరు కడుపు మార్చుకొని మాకు కమ్మని భోజనం వడ్డించండి అన్నట్లు ఉందని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

ఇక ఇటీవల కర్నూల్ జిల్లా లో బాబు పర్యటనలో వైసీపీ నేతల నుంచి గట్టిగానే నిరసన సెగ తగిలింది. కర్నూల్ రాజధానికి బాబు వ్యతిరేకి అని, మూడు రాజధానులకు మద్దతు తెలపాలని బాబుకు అడుగడుగున నిరసన తగిలింది. దీంతో చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయి.. .” రౌడీ రాజ్యం అంటూ.. మీరో మేమో తేల్చుకుందాం.. రండి ” అంటూ ఆందోళన కారులపై బాబు ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. దీంతో బాబు వైఖరి బట్టి చూస్తే అల్లర్లకు తెరతీస్తున్నదని వైసీపీ వర్గాలనుంచి వాదన వినిపిస్తోంది.

ఇక ఉత్తరాంధ్రలో విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని జగన్ ధృడ నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో విశాఖను పరిపాలన రాజధానిగా ఒప్పుకునేందుకు బాబు ఏమాత్రం సిద్దంగా లేరని, కేవలం అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని బాబు ఆశిస్తున్నారని, దాంతో అమరావతి ని రాజధానిగా ఒప్పుకునేందుకు బాబు అల్లర్లు చేపట్టేందుకు కూడా సిద్దంగా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అటు టీడీపీ, ఇటు వైసీపీ మద్య ఈ వాదోపవాదాలు తరచూ ఉండేవే అయినప్పటికి.. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక విజయసాయి రెడ్డి ట్వీట్ పై నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్.. నో యూస్ !

పవన్ మాతోనే ఉంటాడు.. ఉండేటట్లు చేస్తాం !

అప్పుడు జగన్ అపవిత్రం.. ఇప్పుడు బాబు అపవిత్రం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -