Sunday, May 19, 2024
- Advertisement -

ఏపికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం ఆగదు : వైసిపి

- Advertisement -

టిడిపికి తమ పార్టీ ప్రయోజనాలే తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సినిమా షూటింగ్‌లు, ఆర్భాటాల కోసం ఇష్టానుసారంగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తూ,

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని పేర్కొన్నారు. ఏపికి ప్రత్యేక హోదా విషయంలో టిడిపి ప్రభుత్వ, కేంద్ర మంత్రుల తీరును ప్రజలు గమనిస్తున్నారని త్వరలో బుద్ది చెబుతారని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ ప్రయోజనాల కోసం ఏపికి రావాల్సిన ప్రత్యేక హోదాని కేంద్రంలో తాకట్టు పెట్టిందన్నారు. దీనిపై వైయస్‌ఆర్‌సిపి పోరాటం చేస్తుందన్నారు. కలిసి వస్తే అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తామని బొత్సా స్పష్టం చేశారు. అందుకే ఈ నెల 10వ తేదీన మా పార్టీ ధర్నా చేపట్టబోతుందన్నారు. ఇప్పటి నుంచి ఏపికి ప్రత్యేక హోదా వచ్చేవరకు ప్రజా పోరాటాలు ఆగవని అన్నారు. ఏపి వేరు మిగిలిన రాష్ట్రాలు వేరని, ఏపికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలని పేర్కొన్నారు. 

కాగా టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి ఏపికి ప్రత్యేక హోదా రాదన్న విషయం చంద్రబాబుకు ఎప్పుడో తెలుసని సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. 

ఇలాంటి తరుణంలో వైసిపి కనుక గట్టిగా పోరాడి ప్రత్యేక హోదా తెస్తే పార్టీకి ఏపిలో తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.  

 

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -