- Advertisement -
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తృటిలో కారు ప్రమాదం తప్పింది. కర్నూలో మంగళవారం యువభేరిలో పాల్గొన్నారు జగన్. అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పాల్మాకుల వద్ద జగన్ ప్రయాణిస్తున్న కారు టైరుకు పంక్చర్ అయింది.
కారు టైరుకు పంక్చర్ కావడంతో అది అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేశాడు. భద్రతా సిబ్బంది కాన్వాయ్ నుంచి దిగి జగన్కు రక్షణ వలయం ఏర్పాటు చేశారు. కారు టైరు మార్చిన తర్వాత తిరిగి అదే కారులో జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. కారు ఏ మాత్రం పల్టీలు కొట్టినా జగన్కు పెద్ద ప్రమాదమే జరిగేది. అయితే జగన్ సేఫ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.