Monday, May 13, 2024
- Advertisement -

రాహుల్‌ గాంధీపై విరుచుకుపడ్డ వైయస్‌ జగన్!

- Advertisement -

ఆంద్ర ప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్ రాహుల్ గాంధీపై తీవ్రంగ్రా విరుచుకు పడ్డారు. రైతు భరోసా యాత్రలో మాట్లాడుతూ నేను కాంగ్రెస్‌లో ఉన్నంతసేపు మంచివాడన్నారు. బయటికొచ్చాక నాపై కేసులు పెట్టి, వైయస్‌ఆర్ పేరును ఛార్జీ సీటులో చేర్చారు.

ఆయన బతికున్నంత కాలం ఇందిరాగాందీ కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. కాంగ్రెస్‌లో ఉన్నంతవరకు వైయస్‌ఆర్‌ను గొప్పవాడన్నారు. వైయస్‌ఆర్ కోసం ప్రాణాలు వదిలిన వారి కోసం ఓదార్పుయాత్ర చేబడితే నన్ను చెడ్డవారని పేర్కొన్నారు.

చంద్రబాబుతో కలిసి నాపై కేసులు పెట్టారు. అవసమైనపుడు దండ వేస్తారు, అవసరం లేనపుడు బండ వేయడం రాహుల్‌కే చెల్లుతుంది. కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదాకు, పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో పోరాటాలు చేశామని చేస్తూనే ఉన్నామని అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండి చేసే పనితీరు నచ్చే రాహుల్ ఇక్కడకు వచ్చారని జగన్ పేర్కొన్నారు.     

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -