ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు అనే సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు అమ్మాయిల పేర్లు.. వర్ష,హర్ష. వీరు పెద్దగ మీడియాకు కనిపించారు. మామూలుగా ఇదే స్థానంలో వెరే వాళ్లు ఉంటే.. బాగా ప్రచారం అవుతారు. కానీ జగన్ కూతుర్లు.. ఎప్పుడు కూడా బయట ప్రపంచలోకి రాలేదు.
రాజకీయాలకు దూరంగా ఉంచుతూ.. వీరిని పెంచుతున్నారు. వీరు బయటకు కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. మరి ఈ సంగతిలా ఉంటే.. వైఎస్ జగన్ పెద్ద కూతురు వర్ష గురించి ఆసక్తికరమైన విషయం అప్పుడు ఒకటి వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే వర్ష ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు సాధించిందనే విషయం తేలిసిందే . లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎంట్రన్స్ టెస్టులో మంచి మార్కులుంటేనే అక్కడ సీటు వచ్చింది.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సాధించడంతో ఇప్పుడు అక్కడ జాయిన్ అయ్యేందుకు లండన్ వెల్తున్నారు జగన్ కూతురు. వర్షను జాయిన్ చేసేందుకు జగన్, ఆయన కుటుంబ సభ్యులు ఈనెల 11న లండన్ వెల్లనున్నారు. ఈనెల 19న మళ్లీ లండన్నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.