- Advertisement -
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆదివారంతో ఆయన దీక్ష చేపట్టి ఐదో రోజుకు చేరుకుంది.
ఆరోగ్య పరిస్తితి విషమించే అవకాశం ఉన్నందున ప్రతి నాలుగు గంటలకు ఒకసారి వైద్యలు పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే రెండు కెజీల బరువు తగ్గారని డాక్టర్లు తెలిపారు. జగన్ బాగా నీరసించడాని వారు తెలిపారు.వైఎస్ జగన్ శరీరంలో డీహైడ్రేషన్ మొదలైందని, ఆయన దీక్ష విరమిస్తే మంచిదని సూచించారు. కీటోన్స్ కారణంగా కిడ్నీలపై ప్రభావం ఉంటుందని తెలిపారు.మరొవైపు జగన్ చేపట్టిన దీక్షా ప్రాంగణానికి కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు చేరుకున్నారు. వీరు గోప్యంగా సమాచారం సేకరిస్తున్నారు.