ఈనెల 30న ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు బయల్దేరి వెల్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన.. సాయంత్రం 6.30 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడనుంచి రోడ్డు మార్గానా తిరుమళ చేరుకుంటారు.
రాత్రి అక్కడే బస చేసి ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం కడప చేరుకుంటారు. వైఎస్ జగన్ శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఏ కార్యక్రమమైనా చేపట్టడం అనవాయితీగా వస్తోంది.కడపలోని పెద్ద దర్గాను దర్శించుకుంటారు . ప్రత్యేక ప్రార్థన అనంతరం చాదర్ ను అందించనున్నారు. కడప దర్గాను సందర్శించిన అనంతరం చాపర్ ద్వారా కడప నుంచి పులివెందులకు చేరుకుంటారు. పులి వేందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేసిన అనంతరం ఇడుపుల పాయకు వెల్లి తండ్రి వైఎస్ఆర్ సమాధికి నివాలులు అర్పించనున్నారు.