- Advertisement -

గాదె వెంకటరెడ్డి మృతి..జగన్‌ దిగ్భ్రాంతి

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగుతూ ప్రజలకు సేవలందించిన గాదె వెంకటరెడ్డి గారి మరణం రాజకీయ రంగానికి తీరని లోటని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని, ప్రజల సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు.

దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డితో గాదె వెంకటరెడ్డి గారికి ఎంతో సన్నిహిత అనుబంధం ఉందని వైయస్‌ జగన్‌ గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌తో కలిసి ప్రజా సమస్యలపై పనిచేస్తూ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

గాదె వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు వైయస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -