ఆంధ్రప్రదేశ్ డీజీపీ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికరమైన ఆరోపణలు చేస్తున్నారు. డీజీపీ తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గరైన వ్యక్తి అని… తెలుగుదేశం పార్టీకి అనుకూలుడని.. ఆయన తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నాడని..
తెలుగుదేశం వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నేతలను హత్య లు చేస్తున్నా డీజీపీ చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నాడని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా నేత ప్రసాద్ రెడ్డి హత్య విషయంలో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వైకాపా నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ హత్యలో పోలీసుల ప్రమేయం కూడా ఉందని వైకాపా వారు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో గవర్నర్ తో సమావేశం అనంతరం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డీజీపీ పై తీవ్ర విమర్శలు చేశాడు. డీజీపీ జె.రాముడు పదవీ కాలం ముగిసిపోయినా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవీకాలాన్నిపొడిగించారని జగన్ గుర్తు చేశాడు. ఇలా పదవీ కాలాన్ని పొడిగింది.. తెలుగుదేశం వారు హత్యాకాండలు చేయిస్తున్నారని జగన్ అన్నాడు.
”డీజీపీని అనంతపురం జిల్లా తెలుగుదేశం నేతలు అయితే వరసలు పెట్టి పిలుస్తారు. మామా.. చిన్నాయినా… అంటూ కొందురు, అన్నా అంటూ మరికొందరు తెలుగుదేశం నేతలు డీజీపీని పిలుస్తారని.. ఇదీ తెలుగుదేశం నేతలకు, డీజీపీ రాముడికి ఉన్న అనుబంధం..” అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించాడు.
మరి జగన్ మాటలను బట్టి చూస్తే… తెలుగుదేశం నేతలకు డీజీపీ చాలా దగ్గరవాడే అయినట్టుగా ఉన్నాడు!