Tuesday, May 7, 2024
- Advertisement -

లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడనున్న జగన్

- Advertisement -

ప్రస్తుతం అందరి దృష్టి ఆంద్ర్ ప్రదేశ్ రెండో ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ మోహన్ రెడ్డి పైనే ఉంది. రేపు మధ్యాహ్నం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ లో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భం గా రాజకీయ మరియు సినిమా ప్రముఖులు అనేక మంది ఈ వేడుక కి తరలి రానున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భం గా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. అయితే మీడియా తో మాట్లాడుతూ ఆయన జగన్ కోసం ఒక స్పెషల్ షో ని ఆర్గనైజ్ చేస్తాను అని అన్నారు.

రేపు ప్రమాణ స్వీకారం పూర్తి అయిన వెంటనే జగన్ ని కలిసి ఆయనకీ ఈ సినిమా యొక్క స్పెషల్ షో ని వేస్తానని రాము చెప్పారు. అయితే జగన్ ప్రస్తుతం ప్రభుత్వాన్ని కూర్పు చేసుకోవాలి. రానున్న వారం రోజులు జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత కీలకం కానున్న తరుణం లో రామ్ గోపాల్ వర్మ ఆహ్వానాన్ని ఏ మేరకు మన్నిస్తాడు అనే అంశం మీద మనం ఆలోచించాలి.

ఇకపోతే చాలా రోజులకి ఈ సినిమా ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ లో విడుదల కానుండటం తో ఆంద్ర ప్రజలు ఈ సినిమా ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -