- Advertisement -
వైఎస్ జగన్ క్యాబినేట్లో రోజాకు మంత్రి పదవి దక్కుతుందనె వార్తల నేపధ్యంలో రోజా తొలసారి స్పందించారు. రెండు సార్లు జగన్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని అందుకు ఆయనకు రుణపడిఉంటానన్నారు. బాబు దుబారా ఖర్చుల వల్లే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందన్నారు. అందుకే జగన్ దుబారా ఖర్చులు చేయకుండా సాదాసీదాగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని వెల్లడించారు.
జగన్తో పాటి ఉదయం తిరుమళ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు రోజా.తాను ఐరన్ లెగ్ అని ప్రచారం చేసిన టీడీపీ నేతలకు నగరిలో తన గెలుపు చెంపపెట్టని ఆమె వ్యాఖ్యానించారు. ‘జగన్ నమ్మకాన్ని వమ్ము కానివ్వను. ఏపీలో ఏ బాధ్యత అప్పగించినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రజల కోసం జగన్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.