- Advertisement -
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా జనసేన అధ్యక్షుడు పవన్ పై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనె వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్లను భారీగా పెంచించరిత్ర సృష్టించిందని విజయసాయి రెడ్డి తెలిపారు.
మరో వైపు కిడ్నీ బాధితులకు ఫెన్షన్ను రూ.10,000 పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్ధానం కిడ్నీ బాధితుల విషయంలో వ్యవహరించిన తీరుపై పరోక్ష విమర్శలు గుప్పించారు. కిడ్నీ బాధితులను రాజకీయాలకోసం వాడుకున్న వారంతా సిగ్గుతో తలదించుకోవాలన్నారు.కిడ్నీ బాధితులకు యువ ముఖ్యమంత్రి జగన్ ‘నేను చూశాను.. నేను ఉన్నాను’ అంటూ నెలకు రూ.10,000 అందజేస్తున్నారని ప్రశంసించారు. ఈ మేరకు విజయసాయి ట్విట్టర్లో ట్వీట్ చేశారు.