- Advertisement -
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు సీఎం జగన్. 3 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జగన్..వైసీపీ అభ్యర్థులుగా గా గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను ఖరారు చేసినట్లు సమాచారం.
రాజ్యసభ ఎన్నికల ఫలితాలు 26న వెలువడ నుండగా మొత్తం 3 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఎమ్మెల్యే బలంతో రెండు స్థానాల్లో గెలుపు ఖాయం కాగా మూడో స్థానంలో విజయం సాధించడం కోసం ప్రణాళిక సిద్ధం చేశారు జగన్.
అయితే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యపై స్పష్టత రాకపోవడంతో మూడో సీటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడం, కొంతమంది సిట్టింగ్లను మార్చడంతో వారు తిరుగుబాటు చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి ఎత్తుగడ వేశారు అన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.