Thursday, May 2, 2024
- Advertisement -

కియా తెచ్చింది నేనేనన్న బాబు.. షాకిచ్చిన వైసీపీ

- Advertisement -

కియా మోటార్స్.. చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కార్ల కంపెనీ.. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. మొన్నటి ఎన్నికల వేళ ఈ కియా మోటార్స్ ను తెచ్చింది తానేనని ప్రకటనల్లోనూ గుప్పించారు. ఇక పెట్టుబడుల అంశంపై కూడా ఏపీ అసెంబ్లీలో వాడివేడి సమావేశాల సందర్భంగా కియా క్రెడిట్ ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు.

రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు.. పెట్టుబడుల కోసం రేయనక, పగలనక ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేశానని.. విదేశాలకు తిరిగి పెట్టుబడులను రప్పించానని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. కియాను ఉత్తర కొరియా నుంచి రప్పించి ఉద్యోగాలు కల్పించింది తానేనన్నారు.

అయితే అదే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కు గట్టి షాకిచ్చింది వైసీపీ. కియా మోటార్స్ ఏర్పాటు వెనుకున్నది ఎవరో కుండబద్దలు కొట్టింది. తాజాగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ చంద్రబాబు బండారాన్ని బయటపెట్టాడు.

కియో మోటార్స్ ఏపీకి రావడంలో చంద్రబాబు గొప్పతనం ఏదీ లేదని ఆర్థికమంత్రి బుగ్గన ఆధారాలను బయటపెట్టి సంచలనం రేపారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారమే అనంతపురంలో కియా మోటార్స్ పెట్టామని ఆ సంస్థ సీఈవో రాసిన లేఖను ఈ సందర్భంగా బుగ్గన సభలో చదివి వినిపించారు. దీంతో చంద్రబాబు డాంబికా రాజకీయాలకు చెక్ పడింది. సభలో టీడీపీకి షాక్ తగిలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -