Thursday, April 25, 2024
- Advertisement -

పవన్‌ అప్పుడు టీడీపీ.. ఇప్పుడు బీజేపీ ని యాచిస్తున్నారు

- Advertisement -

పవన్‌ కల్యాణ్‌ నిన్న రాష్ట్రంలోని కాపు పెద్దలతో సమావేశమై.. కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్లాలని పవన్‌ అన్నాడు. ఇది కేవలం సినిమా డైలాగ్‌గా మిగిలిపోతే ఎలా..? ముందు పవన్‌ యాచించడం మానాలి. మొదట తెలుగుదేశాన్ని.. ఇవాళ బీజేపీని యాచిస్తున్నారు. కాస్త మీ కాళ్ల మీరు నిలబడే పరిస్థితికి వస్తే.. అప్పుడు ఒక కులాన్ని శాసించే స్థాయికి తీసుకెళ్తారు.. పవన్‌ కల్యాణ్‌ మీరే యాచించే స్థాయిలో ఉన్నారు.

తిరుపతి సీట్‌ ఇవ్వండి.. జీహెచ్‌ఎంసీ సీట్లలో మాకు కొన్ని ఇవ్వండి అని యాచించారు. జీహెచ్‌ఎంసీలో సీట్లు ఇవ్వలేదు.. తిరుపతి సీటు అడిగితే పవన్‌కు బీజేపీ పుచ్చిపోయిన లడ్డూ ఇస్తుందేమో.. 2014లో చంద్రబాబును యాచించి సీఎంను చేశారు.. ఏం చేశాడు చంద్రబాబు చివరకు..

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం జరిపినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ ఉన్నారు..? గత చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడ కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేస్తున్న రోజుల్లో చిరంజీవి, దాసరి నారాయణరావు బయటకు వచ్చి హోటల్‌ హయత్‌లో గర్జించి.. ముద్రగడకు ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరికలు పంపారు. అప్పుడు పవన్‌ ఎక్కడున్నారు. ముందు పవన్‌ యాచించే స్థాయి నుంచి సొంత కాళ్ల మీద నిలబడే స్థాయికి వెళ్లండి’ అని అంబటి రాంబాబు సూచించారు.

చంద్రబాబు రుణం తీర్చుకోవాలని నిమ్మగడ్డ తాపత్రయం

విజయనగరంలో టీడీపీకి భారీ షాక్!

సొంత మరదల్ని పెళ్లి చేసుకున్న హీరోలు వీరే..!

మన స్టార్స్ నోరు జారినప్పుడు.. జరిగిన వివాదం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -