మాజీ మంత్రి టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. గత కొన్నాల్లుగా పార్టీలో చేరాల అనే మీమాంసలో ఊగిసలాడిన ఆనం చివరకు పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 2 జగన్ సమక్షంలో వైసీపీ ఖండువా కప్పుకోనున్నారు.
జగన్ పెట్టిన కండీషన్కు ఒప్పు కున్న తర్వాతనే పార్టీలో చేరుతున్నారు. ఆనంను చేర్చుకోవడం వైసీపీకి కలిసొచ్చే అంశమే అయినా నియోజకవర్గం విషయమే తలనొప్పిగా మారింది. మొదటి నుంచీ ఆనం వెంకటగిరి సీటు కావాలని జగన్ను కోరిన సంగతి తెలసిందే. అయితే జగన్ మాత్రం అందుకు అంగీకరించలేదు.
జగన్ ముఖ్య అనుచరులు మేకపాటి కుటుంబీకులు ఆత్మకూరుకి ఫిక్స్ అయ్యారు. వెంకటగిరి నియోజకవర్గంపై ఇప్పటికే జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. నెల్లూరు రూరల్, సిటీల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఆనం కుటుంబానికి పట్టున్న ఈ 4 నియోజకవర్గాల్లో ఆయన్ని ఎక్కడ అడ్జస్ట్ చేయాలనే విషయంపై జగన్ కూడా కసరత్తు చేయాల్సి వస్తోంది.
అందుకే నియోజకవర్గం అనే హామీ అడక్కుండా ఆనంను పార్టీలో చేర్చుకుంటున్నారు జగన్. ఆ ఒక్కటీ అడక్కు అనే కండిషన్ పెట్టేశారు. ఈ కండిషన్ కు ఓకే చెప్పిన తర్వాతే పార్టీ చేరికకు మహూర్తం ఫిక్స్ అయింది. అయనకు ఎక్కడనుంచి టికెట్ కేటాయిస్తారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.