Wednesday, May 15, 2024
- Advertisement -

జేసీ నిజస్వరూపాన్ని పూర్తిగా బయటపెట్టిన టిడిపి మేయర్ స్వరూప

- Advertisement -

జేసీ దివాకరరెడ్డి దేవతా వస్త్రాలను పూర్తిగా కాల్చిపడేసింది టిడిపి మేయర్ స్వరూప. జేసీ నిజస్వరూపాన్ని బయటపెట్టేసింది. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఇదే జేసీల గురించి టిడిపి మీడియా, బాబుతో సహా టిడిపి నేతలందరూ కూడా ఏ స్థాయిలో విమర్శించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టిడిపిలో జాయిన్ వెంటనే పచ్చ బ్యాచ్ మొత్తానికి జేసీలు పుణ్యాత్ముల్లా కనిపించడం మొదలైంది. తన భర్తను జేసీనే చంపించాడు అని తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన పరిటాల సునీత కూడా జేసీతో కాంప్రమైజ్ అవ్వడం ఏ విలువలకు సంకేతమో అస్తమానూ ఎదుటి వారికి నీతులు చెప్పే పచ్చ పార్టీ జనాలు, ఎల్లో మీడియానే చెప్పాలి. ఇక జేసీ చేత జగన్‌ని తిట్టిస్తూ చంద్రబాబు ఓ స్థాయిలో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆ జేసీ నిజస్వరూపాన్ని టిడిపి మేమర్ స్వరూప పూర్తిగా బయటపెట్టేసింది.

తాను పప్పుసుద్దని, నిజాలు చెప్తున్నా అని చెప్పుకుంటూ జగన్‌ని తీవ్రస్థాయిలో విమర్శించే జేసీని ‘రాక్షసుడు’ అని చెప్పుకొచ్చింది స్వరూప. జేసీల రాక్షసత్వాన్ని గురించి చాలానే చెప్పుకొచ్చింది. ఇక ఎప్పుడూ కూడా రిటైర్ అవుతా అని కబుర్లు చెప్పే జేసీలు ఎంపి నిధుల నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికి ఖర్చుపెట్టరని, పూర్తిగా డబ్బు మనుషులని చెప్పుకొచ్చింది. ఇంతవరకూ అనంతపురానికి అర్థ రూపాయి కూడా ఖర్చుపెట్టిన పాపాన పోలేదని ఆరోపించింది. జేసీల బస్సు ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు కనీస స్థాయిలో కూడా కాంపెన్సేషన్ ఇవ్వలేదు జేసీలు. అలాగే జేసీల దోపిడీ గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. అయినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు కూడా చూసీ చూడనట్టుగా పోతూ ఉన్నాడు. ప్రజలు ఎటుపోతేనేం అని అనుకుంటూ రాజకీయ స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. కానీ జేసీలు మాత్రం అనంతపురంలో రాక్షసకాండ నిర్వహిస్తూ దందాలు చే్స్తున్నారన్నది నిజం. ఇప్పుడు ఆ నిజాలన్నీ టిడిపి మేయర్ నుంచే వచ్చాయి. ఇకనైనా చంద్రబాబులో స్పందన ఉంటుందా? జేసీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాడా? ఆ అవకాశమే లేదు. మేయర్ స్వరూప కంటే జేసీల బలం ఇప్పుడు చంద్రబాబుకు చాలా అవసరం. అయితే గియితే జనాలకు జేసీలు ఏమీ చేయలేదు, జేసీ రాక్షసుడు అని నిజాలు చెప్పిన టిడిపి మేయర్ స్వరూపను మాత్రం చంద్రబాబు దండించడం, శిక్షించడం ఖాయం. ఎమ్మార్వో వనజాక్షి ఇష్యూ నుంచి ప్రతి ఇష్యూలోనూ చంద్రబాబు తీరు ఇదే. నారాయణ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు చనిపోతేనేం బాబుకు నారాయణ నిధులు కావాలి కాబట్టి క్షమించేస్తాడు. జేసీలు ఎంత రాక్షసులైతేనేం ….బాబుకు వాళ్ళ అంగబలం, అర్థబలం కావాలి కాబట్టి క్షమించేస్తాడు. పాపం పవన్ కళ్యాణ్‌కి కూడా ఇలాంటి తప్పులు అస్సలు కనిపించవు. అదేంటో మరి. ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, ప్రపంచానికి పాఠాలు చెప్పగల ముఖ్యమంత్రి పాలనలో బలవంతుడి చేతులో బలహీనులు బలయిపోతున్న కథలు ఎన్నో……

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -