వైఎస్ జగన్పై దాడి ఘటన నేపథ్యంలో వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనలో తనను ‘ఏ1′ అని, డీజీపీని ‘ఏ2′ అంటూ ఆరోపణలు చేస్తున్నారంటూ ద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు .అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు. రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో బాబు ఢిల్లీ వెల్లనున్నారు.ఏపీకి కేంద్రం సాయం చేయకపోవడం, జరుగుతున్న ఐటీ దాడులు, జగన్ దాడి ఘటన, గవర్నర్ తీరు తదితర అంశాలపై టీడీపీ ఎంపీలతో ఆయన చర్చించనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు జాతీయ మీడియా సమావేశంలో చంద్రబాబు ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది.