Thursday, May 2, 2024
- Advertisement -

పాద‌యాత్ర‌నుంచి జ‌గ‌న్ దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి బాబు మాస్ట‌ర్ ప్లాన్‌…

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర ప్రారంభించేలోపు ఆయ‌న‌ను మాన‌సికంగా దెబ్బ‌కొట్టేందుకు బాబు మాస్ట‌ర్ ప్లాన్ విజ‌య‌వంతం అవుతోంది. పాద‌యాత్ర ప్రారంభం అయితె పార్టీకి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధ‌మ‌వుతోంది. వ‌ల‌స‌ను ఒక సారిగా ప్రోత్స‌హించ‌కుండా విడ‌త‌ల‌వారీగా పార్టీ కండువాలు క‌ప్పుతున్నారు.

ప్ర‌స్తుతం బుట్ట రేణుక‌తో వ‌ల‌స‌లు ఆగిపోయోట‌ట్లు క‌నిపించ‌డంలేదు. వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు – అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేత ఒకరు – చిత్తూరు జిల్లాలో ఇద్దరు – ముగ్గురు వైకాపా నాయకులు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైకాపా నుంచి టీడీపీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న ఎంపి – ఎమ్మెల్యే – ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులకు అధినేత చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు సమాచారం.

పార్టీని వీడి అధికారం కోసం వెళ్తున్నారన్న అంశాన్ని జనంలోకి వైకాపా సమర్థవంతంగా తీసుకుపోగలిగితే జగన్ పాదయాత్రకు అనుకున్నంత మైలేజీ వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో పార్టీలో జరిగే పరిణామాలను పట్టించుకుని సరిదిద్దుకునే సమయం ఉండదని టిడిపి నేతలు భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో వ‌ల‌స‌ల‌ను వీలైనంగా ప్రోత్స‌హించాల‌నేది బాబు ప్లాన్‌.

టీడీపీ అధినేత చంద్రబాబు వ‌ల‌స‌ల ఎత్తుగడ వెనుక లాజిక్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. విడతల వారీగా వైకాపా నుంచి టీడీపీలో చేర్చుకోవడం ద్వారా జగన్ దృష్టిని పాదయాత్ర నుంచి పార్టీని కాపాడుకునే వైపు మళ్లించవచ్చని..తద్వారా యాత్రను భగ్నం చేయవచ్చన్నది టీడీపీ యోచనగా ఉంద‌నె భావ‌న విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు. బాబు ప్లాన్ ను జ‌గ‌న్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -