ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం, కొంతమందికి టికెట్లు నిరాకరణ ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తమ ఎమ్మెల్యే వేరే స్థానం నుండి పోటీ చేస్తున్నారు, టికెట్ రావడం లేదు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేతో స్వయంగా భేటీ అవుతున్న జగన్…ఎందుకు సిట్టింగ్లను మారుస్తున్నానో స్పష్టంగా చెబుతున్నారు.
ఇప్పటికే 20 మందికి పైగా ఎమ్మెల్యేలు సీఎం జగన్ని కలవగా ఇందులో కొంతమందికి సీట్లు ఇవ్వడం లేదని తేల్చిచెప్పారు. కొంతమంది నియోజకవర్గాలను మార్చగా మరికొందరిని ఎంపీలుగా పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని వారికి చెప్పి కన్విన్స్ చేయడంలో జగన్ సక్సెస్ సాధించారనే చెప్పాలి.
ఇప్పటికే 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చగా మరికొంతమందిని మార్చనున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ఏ కారణంతో అసెంబ్లీ నియోజకవర్గాన్ని మార్చాల్సి వస్తుందో వారికి వివరిస్తున్నారు. మళ్లీ అధికారం, గెలుపే లక్ష్యమని వారికి వివరిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేల స్థానాల మార్పుపై సర్వే నిర్వహిస్తున్న జగన్..పలు సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. త్వరలోనే అభ్యర్థుల మార్పుకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేయనున్నారు.