Monday, April 29, 2024
- Advertisement -

ఢిల్లీలో ఏపీ సినిమాను అద్భుతంగా ప్ర‌ద‌ర్శించిన చంద్ర‌బాబు..

- Advertisement -

ఢిల్లీ వేదిక‌గా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు చ‌క్క‌టి సినిమా చూపించారు. రంగ స్థ‌లం సినిమాను త‌ల‌ద‌న్నే రీతిలో మూవీని ప్ర‌ద‌ర్శించారు. ఏపీకి జరిగిన అన్యాయాలను వివరిస్తూ చంద్రబాబు నాయుడు కొన్ని వీడియోలను ప్రదర్శించారు. వీడియోల‌లో మోదీని విల‌న్ గా బాబు బాగా చిత్రీక‌రించారు.

2014 ఎన్నికల ప్రచారంలో, అమరావతి శంకుస్థాపన సమయంలో నరేంద్ర మోదీ మాటలు, వాటికి వెంకయ్య నాయుడి అనువాదం వీడియోలను చూపించారు. అటుపై తాను ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి గల కారణాలను ఏకరువు పెట్టారు. తను అనుకున్నదే లీకుల రూపంలో గ‌తంలో చూపించిన సినిమానే చూపించారు.

సినిమా పూర్త‌యిన త‌ర్వాత మూవీ విజ‌యోత్స‌వ ప్రెస్‌మీట్ పెట్టారు బాబు. ప్రెస్‌మీట్‌లో చెప్పిన దాంట్లో కొత్తేమి లేదు. గ‌తంలో ఏం చెప్పారో అవే చెప్పి అక్క‌డున్న వారికి హిరిటేట్ తెప్పాంచారంట‌. అది ప‌క్క‌న పెడితే విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌లో ఏ ఒక్క దానికి కూడా స‌రైనా స‌మాధానం చెప్ప‌కుండా డొంక‌తిరుగుడు స‌మాధానాలు చెప్పి త‌పించుకున్నారు..

రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఇదే సినిమాతో ప్ర‌ద‌ర్శించారు. అయితే బాబు అనుకున్నంత సానుభూతి ప్ర‌జ‌ల‌నుంచి రాక‌పోవ‌డంతో..అదే సినిమాను ఢిల్లీలో ప్ర‌ద‌ర్శించారు. దీని ద్వారా ఏపీ ప్ర‌జ‌ల‌కోసం ఎంత క‌ష్ట‌ప‌డుతున్నాడో చెప్పుకొనే ప్ర‌య‌త్నం త‌ప్ప రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కాద‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

చంద్ర‌బాబు ఢిల్లీలో సినిమాను చ‌క్క‌గా ప్ర‌ద‌ర్శించారు. సినిమాతో దేశ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తార‌ని ప‌చ్చ‌బ్యాచ్ గొప్ప‌లు చెప్పుకున్నారు. రంగ‌స్థ‌లం సినిమా రామ్ చ‌ర‌ణ్‌కు మంచి మైలేజ్ ఇచ్చింది. మ‌రి బాబు ప్ర‌ద‌ర్శించిన సినిమా ద్వారా బాబుకు ఎంత వ‌ర‌కు మైలేజ్ వ‌చ్చింద‌నేది పార్టీ నాయ‌కుల‌కే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -