వైఎస్ జగన్పై రాజకీయ కక్ష్యల నేపథ్యంలోనే కేసులు ఉన్నాయన్నది టిడిపి భజన మీడియా కూడా ఒప్పుకునే నిజం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు కూడా ఈ నిజాన్ని అంతర్గత చర్చల్లో ఒప్పుకుంటూనే ఉంటారు. మరి అదే నిజాన్ని జగన్ని శతృవులాగా ట్రీట్ చేసే చంద్రబాబు కూడా ఒప్పుకుంటే? ఆ అవకాశం ఉందా? రాజకీయ కక్ష్య సాధింపు కోసమే నాపై కేసులు అని జగన్ చెప్తున్న మాటలతో చంద్రబాబు ఏకీభవిస్తాడా? సోనియాతో ఢీ కొట్టాడు కాబట్టే జగన్పై సోనియా కేసులు పెట్టించింది అని చంద్రబాబు చెప్తాడా?
చెప్తాడా కాదు…… నిజాలు నిర్భయంగా చెప్పేశాడు చంద్రబాబు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సందర్భంగా తన భజన తానే చేసుకుంటూ…… భజన మీడియా చేత కూడా డప్పు కొట్టించుకుంటూ పాలనా పరమైన కార్యక్రమాల్లో కంటే మీడియాలోనే ఎక్కువ కనిపిస్తున్నాడు చంద్రబాబు. అలా ఓ మీడియా సంస్థకు ఇంటర్యూ ఇస్తున్న సందర్భంలోనే నిజాలు చెప్పేశాడు చంద్రబాబు.
వైఎస్ రాజశేఖరరెడ్డితో కూడా ప్రత్యర్థిగా ఉంటూ రాజకీయాలు చేశానని కానీ జగన్ మాత్రం యారగెంట్ అని చెప్పుకొచ్చాడు చంద్రబాబు. మొండితనం కూడా చాలా ఎక్కువ. ‘సోనియాతో శాంతియుతంగా సర్దుకుపోయే ప్రయత్నం చేయకుండా….సోనియానే ఢీ కొట్టాడు…..అందుకే కోపం వచ్చిన సోనియా గాంధీ జగన్ని జైలుకు పంపించింది. ఇవీ ఒక మీడియా సంస్థకు ఇంటర్యూ ఇస్తూ బాబు చెప్పిన మాటలు.
జగన్ తప్పు చేశాడు…..ప్రపంచంలోనే పెద్ద తప్పులు చేశాడు……..అందుకే జైలుకు వెళ్ళాడు అని కొన్నేళ్ళుగా ప్రచారం చేసిన చంద్రబాబు ఎట్టకేలకు నిజం అయితే ఒప్పుకున్నాడు. సోనియాతో ఢీ కొట్టబట్టే జగన్పై సోనియా కేసులు పెట్టించింది అని చెప్పాడు. పనిలో పనిగా సోనియాతో కుమ్మక్కై నేను కూడా జగన్పై కేసుల్లో భాగమయ్యానని చెప్పి ఉంటే బాగుండేది. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కయి……కేవలం జగన్ని దెబ్బకొట్టడం కోసం…..రాష్ట్ర విభజనతో సహా అన్నీ వ్యవహారాలు నడిపింది చంద్రబాబే అని కదా జాతీయస్థాయి విశ్లేషకులు చెప్తూ ఉన్నవిషయం. మొత్తానికి సోనియాను ఢీ కొట్టబట్టే సగం జగన్పై కేసులు అన్న నిజాన్ని అయినా చంద్రబాబు ఒప్పుకోవడం మాత్రం చాలా గొప్ప విషయమే.
https://www.facebook.com/IamKodaliNani/videos/2117653038458398/