Thursday, May 2, 2024
- Advertisement -

బాల‌య్య‌చేతితో ఓడిన నేత‌కు జ‌గ‌న్ బంఫర్ ఆఫర్‌..

- Advertisement -

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పాల‌న‌కు పెద్ద పీట వేస్తూనె పార్టీ నాయ‌కుల మంచి చెడులు చూసుకుంటున్నారు. పార్టీని న‌మ్ముకుని ఉన్న వాల్ల‌కు జ‌గ‌న్ పెద్ద‌పీట వేస్తున్నారు. తాజాగా హిందూపురంలో బాల‌య్య చేతిలో ఓడిన నాయ‌కునికి జ‌గ‌న్ బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు.

హిందూపురంనుంచి బాల‌య్య చేతిలో ఇగ్బాల్ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ సునామీలో కూడా బాల‌య్య రెండో సారి గెలిచి చూపించాడు. బాల‌య్య చేతిలో హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన.. ఇక్బాల్‌ను ఎమ్మెల్సీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా.. గుంటూరులోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్ ఈ హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి ఐదుగురికి టికెట్లు ఇస్తే నలుగురు గెలిచార‌ని కాని ఇగ్బాల్ మాత్రం ఓడిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.అధికారంలోకి వచ్చాక జగన్ ప్రకటించిన తొలి ఎమ్మెల్సీ ఇక్బాల్ కావడం విశేషం. వైఎస్ పాలనను గుర్తుకు తెచ్చేలా తన పాలన ఉంటుందన్న జగన్.. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన టీడీపీకి 23 మంది మే 23న వెల్లడైన ఫలితాల్లో 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారని ఎద్దేవ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -