Wednesday, May 22, 2024
- Advertisement -

ఏపీలో మద్యం ధరల పెంపుపై సీఎం జగన్ క్లారిటీ..!

- Advertisement -

లాక్ డౌన్ నుంచి కొన్ని సడలింపు ఇవ్వడంతో చాలా రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. నిన్నటి నుంచి అమ్మకాలు ప్రారంభించారు. మొదటి రోజు మద్యం ధర 25 శాతం పెంచిన ప్రభుత్వం.. రెండో రోజు మరో 50 శాతం ధరను పెంచింది. అయినా సరే మందుబాబు ఎక్కడ తగ్గడం లేదు. ఈ క్రమంలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్.. ఇలా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగేలా చూస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

దీంతో ధరల పెంపుపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి లిక్కర్ ధరలను భారీగా పెంచినట్టు ఆయన వెల్లండిచారు. ఇక అక్రమ మద్యం రవాణపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళవారం కలెక్టర్లు ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి 75 శాతం పెంచాలి. మనం 25 శాతం పెంచి తగ్గించాలనుకుంటే.. ఢిల్లీలో 70 శాతం పెంచారు. అందుకే 75 శాతం పెంచి.. గట్టి చర్య తీసుకున్నాం.

మద్యం దుకాణాల సంఖ్యను మరో 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 20 శాతం తగ్గించాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 33 శాతం తగ్గించినట్టు అవుతుంది. ప్రతి షాపు వద్ద ఇంతకుముందు ప్రైవేటు రూమ్స్ పెట్టారు. మనం దీన్ని రద్దుచేశాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 43 వేల బెల్టు షాపులను రద్దు చేశాం అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యం విక్రయించే వేళలలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ పరిమితం చేశాం అని అందులో భాగంగానే ఈ 75 శాతం పెంపు నిర్ణయం కూడా తీసుకున్నాం అని షాక్ కొట్టించే రేట్లు ఉండాలని నిశ్చయించుకున్నాం అని అయన తెలిపారు. దీనివల్ల పక్క రాష్ట్రం నుంచి రవాణా.. అలానే నకిలీ మద్యం తయారీని కూడా అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి బాధ్యత ఎస్పీల మీద ఉంటుంది. దీనికోసం ప్రత్యేక పోలీసు అధికారిని పెట్టాంఅని లిక్కర్ – ఇసుక మీద కలెక్టర్లు – ఎస్పీలు గట్టి ధ్యాస పెట్టాలి. కేవలం ఎక్సైజ్ సిబ్బంది మాత్రమే పూర్తిగా నియంత్రించలేరు అని మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలని సీఎం జగన్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -