తెలంగాణ కాంగ్రెస్లో వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా మహబూబ్నగర్కు చెందిన మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎంపీ సీటు ఆశీంచిన జితేందర్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. దీంతో బీజేపీకి రాజీనామా చేసి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక జితేందర్ రెడ్డి పార్టీలో చేరిన 24 గంటల్లోపే జాక్ పాట్ కొట్టేశారు.
న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జితేందర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు కూడా కాంగ్రెస్లో చేరారు.
ఇక మహబూబ్నగర్ సీటును డీకే అరుణకు కేటాయించింది బీజేపీ. దీంతో బీజేపీపై జితేందర్రెడ్డి అసంతృప్తితో ఉండగా సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు.