Friday, May 17, 2024
- Advertisement -

టీడీపీలో ముగ్గురు మొన‌గాల్లు….

- Advertisement -

టీడీపీ నుంచి లోకేష్‌,జ‌లీల్ ఖాన్ లాంటి నాయ‌కులు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. తాజాగా వారి స‌ర‌స‌న మ‌రో మంత్రి అచ్చెన్నాయుడు చేరారు. కుడి ఎడ‌మైతె పోర‌పాటు ల‌ద‌న్న‌ట్లుగా త‌యార‌య్యింది నేత‌ల తీరు. సీనియ‌ర్ మంత్రి అయి ఉండి క‌నీసం జ‌యంతి,వ‌ర్థంతికికూడా తేడా తెలియ‌కుండా మాట్లాడ‌టం సోషియ‌ల్ మీడియిలో నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

జయంతిని వర్థంతిగా, వర్థంతిని జయంతిగా మారిస్తే తప్పేంటి అనుకున్నారో ఏమో గానీ నారా లోకేష్‌ బాటలోనే మంత్రులు ప్రయాణిస్తున్నారు. ఆ మధ్య అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వర్థంతి శుభాకాంక్షలు చెప్పి నారా లోకేష్‌ షాక్ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు కూడా తడబడకుండా జయంతిని వర్థంతిగా మార్చేసి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ల‌కేష్ వార‌స‌త్వాన్ని మంత్రి తీసుకున్నార‌ని నాయ‌కులు,కార్య‌క‌ర్త‌లు అనుకుంటున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్బంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు… లచ్చన్న జయంతిని వర్థంతి అని చెప్పారు. అంతటితో ఆగకుండా వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆయన ఏమాత్రం తడబడకుండా చెప్పారు. వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందకరమన్నారు. జయంతిని వర్థంతిగా చెప్పడమే ఒక తప్పు అయితే… తిరిగి వర్థంతిని ఘనంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు చెప్పడం చూసి నారా లోకేష్‌ కంటే తమ మంత్రి చాలా స్పీడ్‌గా ఉన్నారని టీడీపీకార్యకర్తలే సెటైర్లు వేసుకున్నారు.

వెంట‌నేతేరుకున్నమంత్రిలోకేష్మీద‌కునెట్టేశాడు.గ‌తంలోఅంబేత్క‌ర్జయంతిని..వ‌ర్థంత‌నిసంబోదించార‌ని..ఆయ‌నస‌హ‌చ‌ర్యం వ‌ల్ల త‌న‌కు అలానె వ‌చ్చింద‌ని క‌వ‌ర్ చేసుకొనేదానికి ప్ర‌య‌త్నించారు. దీంతో అక్క‌డున్న వారంతా న‌వ్వుకున్నారు. లోకేష్‌కు అంటె కొత్త మ‌రి అచ్చెన్నాయుడి తెలివి ఏమైంద‌ని జ‌నాలు న‌వ్వుకుంటున్నారు. ఈవిష‌యం బాబు వ‌ర‌కు వెల్తే మంత్రికి క్లాస్ త‌ప్ప‌దంటున్నారు పార్టీ నాయ‌కులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -