Monday, May 20, 2024
- Advertisement -

మోదీనీ నిల‌దీసే ద‌మ్ము జ‌గ‌న్‌కు లేదా..మంత్రి నారా లోకేష్‌

- Advertisement -

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష‌, అధికార‌పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. చంద్ర‌బాబుపై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి లోకేష్ కౌంట‌ర్ ఇచ్చారు. మోదీ కాళ్ల మీద పడుతూ, పిఎంఓ చుట్టూ తిరుగుతూ ప్రత్యేక హోదా ముసుగులో కేసుల మాఫీ కోసం జగన్ మరోసారి క్విడ్ ప్రో కో నాటకం ఆడుతున్నార‌ని ట్విట్ట‌ర్ ద్వారా విమ‌ర్శించారు.

ఢిల్లీ పెద్దల మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడానికి 5 కోట్ల తెలుగు ప్రజలు తమ రోషాన్ని చూపిస్తుంటే, మోదీని నిలదీసే దమ్ము, ధైర్యం లేని జగన్ మాత్రం ప్రజల్ని మోసం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు. ప్ర‌త్యేక‌హోదా కోసం, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం పోరాడుతుంటే జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

 

మోదీ కాళ్ల మీద పడుతూ, పిఎంఓ చుట్టూ తిరుగుతూ ప్రత్యేక హోదా ముసుగులో కేసుల మాఫీ కోసం జగన్ మరోసారి

క్విడ్ ప్రో కో నాటకం మొదలుపెట్టాడు. (1/2)

— Lokesh Nara (@naralokesh) April 7, 2018

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -