Monday, April 29, 2024
- Advertisement -

జ‌గ‌న్‌, వైఎస్ఆర్‌ను విమ‌ర్శించిన మంత్రుల‌ను దుమ్ము దులిపిన‌ మ‌హిళ‌..

- Advertisement -

ఏపీ మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావులకు చుక్క‌లు చూపించింది ఓ మ‌హిల‌. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కెఎస్ జవహర్ పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన తర్వాత సభలో జవహర్ మాట్లాడుతూ, జగన్ పై అనుచిత వ్యాఖ్యలు మొదలుపెట్టారు.

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మంత్రి జవహార్ విమర్శలు, తప్పుడు ఆరోపణలు చేస్తుండగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళ ధైర్యంగా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హతే మీకు లేదంటూ సభలో నిలదీశారు. దీంతో అవాక్కవ్వడం వేదిక మీదున్న మంత్రుల వంతయింది.

వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఆ మహిళ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గానీ, వైఎస్ జగన్ గానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిజాయితీ పరుడు, ఆయన గురించి తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ మంత్రులను సభలోనే కడిగిపారేశారు

కావాలనే మంత్రులంతా జగన్ పై బురదచల్లుతున్నట్లు మండిపడ్డారు. అంతేకాకుండా మంత్రిని మాట్లాడనీయకుండా పదే పదే జగన్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు మొదలుపెట్టారు. దాంతో ఏం చేయాలో అర్ధంకాక కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెళ్ళిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -