Friday, May 17, 2024
- Advertisement -

స్పీకర్‌కు రాజీనామా ప‌త్రాలు స‌మ‌ర్పించిన వైసీపీ ఎంపీలు

- Advertisement -

చెప్పిన విధంగానే వైసీపీ లోక్ సభ సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ను ఆమె ఛాంబర్ లో కలసి తమ రాజీనామాలను సమర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, రాజీనామాలను ఉపసంహరించుకోవాలని, ఎంపీలుగా కొనసాగుతూనే పోరాటం చేయాలని సూచించారు.

అయితే ఎంపీలు మాత్రం స్పీక‌ర్ సూచ‌న‌ను సున్నితంగా తిరస్క‌రించారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర హక్కుల కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం వారు అక్కడ నుంచి ఏపీ భవన్ కు బయల్దేరారు. స్పెషల్ స్టేటస్ కోసం ఆమరణదీక్షను వారు చేపట్టనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -