వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవిలో కొనసాగుతున్న అభిలప్రియ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. తన పట్ల పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్నారు. తాజాగా సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చింది. కర్నూలు జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు బాబు. కాని అఖిల మాత్రం పాల్గొనలేదు. బాధ్యాతాయితమై నమంత్రి పదవిలో ఉండి కనీసం సీఎం వచ్చినప్పుడు కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లేదాని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అఖిల అలకకు ఇటీవల జరిగిన పరిణామాలే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం మంత్రి అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేయడం జిల్లాలో కలకలం రేపింది. ముఖ్యమైన అనుచరుల్లో ఒకరైన సంజీవ నాయుడిని అరెస్ట్ చేసి, పీడీ యాక్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీనీ వెనక్కి పంపి నిరసన వ్యక్తం చేసింది . చెల్లి బాటలోనే నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికూడా సెక్కూరిటీని వెనక్కిపంపి తన నిరసన తెలిపారు.
మరో వైపు ఈ వివాదంపై కొద్ది రోజుల క్రితం హోమంత్రి చినరాజప్ప అఖిలకు కౌంటర్ ఇచ్చారు. ఆమెకు ఏమీ తెలియదని..నేర్చుకోవాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా త్వరలో జరిగే ఎన్నికల్లో భూమా కుటుంభంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తానని బాబు పార్టీ నేతలతో అన్నట్లు సమాచారం. అసలు అఖిలకే టికెట్ బాబు ఇచ్చే పరిస్థితలు కూడా లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇదే విషయంపై జిల్లాకు చెందిన సీనియర్ నేత, డిప్యూటీ సీఎం కృష్ణ మూర్తిని కలవడానికి ప్రయత్నిస్తే అయన అంత ఆసక్తి చూపించలేదని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అఖిలకు పొమ్మనలేక పొగబెడ్తున్నారని అనుచరలు వాపోతున్నారు. బాబు మార్క్ రాజకీయం అర్థం చేసుకున్న మంత్రి పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో కొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలా? లేక జనసేన పార్టీలో చేరాలా? అన్న డైలమాలో ఆమె ఉందని తెలుస్తోంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పార్టీ వీడితే మాత్రం జిల్లా రాజకీయాలు మరో మలుపు తిరగనున్నాయి.