Monday, April 29, 2024
- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే గంటాపై నిప్పులు చెరిగిన మంత్రి అవంతి శ్రీనివాస్..

- Advertisement -

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పై నిప్పులు చెరిగారు టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ . తన పదవి కోసం నమ్మినవాళ్లను ముంచిన చరిత్ర గంటా శ్రీనివాసరావుదని అవంతి విమర్శించారు.మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ను తాను కనీసం మనిషిగా కూడ చూడనని ఆయన చెప్పారు. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన వారికి తమ పార్టీలో చోటు లేదన్నారు.

అన్నం పెట్టినవారికి గంటా సున్నం పెడతారు. తనను రాజకీయాల్లోకి తెచ్చిన అయ్యన్నకే గంటా శ్రీనివాసరావు సున్నం పెట్టారని నిప్పులు చెరిగారు. గంటా ఇంకా మంత్రి అనే భ్రమల్లో ఉన్నారని వాటినుంచి బయటకు రావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.గంటా నాకు సున్నం పూయాలని చూశారు. నేను పూయించుకోలేదు. ఏదో అదృష్టం బాగుండి గంటా స్వల్ప మెజారిటీతో ఈ ఎన్నికల్లో గెలిచారు. వైసీపీ మంచివాళ్లను మాత్రమే చేర్చుకుంటుంది. కబ్జాదారులను కాదు’ అంటూ అవంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -