Friday, May 3, 2024
- Advertisement -

ఎంపీ కొత్త ప‌ల్లి గీత‌ వైసీపీనా…? టీడీపీనా…? లేకా భాజాపానా…?

- Advertisement -

ఫిరాయింపు ఎంపీ కొత్త ప‌ల్లిగీత తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మూడున్న‌రేళ్ల క్రితం టీడీపీలోకి వెల్లిన గీత నుంచి బాబుకు పెద్ద షాక్ ఇచ్చింది. బ‌డ్జెట్‌లో ఏపీకీ న్యాయం జరగాలని పార్లమెంటులో టీడీపీ – వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌లు రెండు పార్టీల‌కు పెద్దషాక్ అనే చెప్పాలి.

కేంద్రం ప్యాకేజీ ప్ర‌క‌టించిన రోజున ఆందోళ‌న‌లు చేయ‌కుండా ఇప్పుడు డ్రామాలాడుతున్నార‌ని మండిప‌డ్డారు. కేంద్రం ఇచ్చే నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. హోదా కంటే ప్యాకేజీ మంచిదని అసెంబ్లీలో ప్రకటన చేసి – సన్మానాలు కూడా చేయించుకున్నారని ఇపుడు ప్యాకేజీ బాగోలేదని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పోలవరం – అమరావతికి కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క ఎందుకు చూపించడం లేదని ఆమె ప్రశ్నించారు.

గడచిన నాలుగు సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రం ఎందుకు లెక్క చెప్పడం లేదని ఆమె ప్రశ్నించారు. తన నియోజకవర్గానికి కేంద్రం రూ.25 వేల కోట్ల నిధులిచ్చిందని….దానికి సంబంధించి ఒక్క పైసాకు లెక్క లేదని…..తాను అడిగినా కూడా ప్రభుత్వం నుంచి సమాధానం లేదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -