- Advertisement -
పవన్పై జగన్ చేసిన వ్యాఖ్యలను ముమ్మాటికి తప్పే నని రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పు బట్టారు. పవన్ పెళ్లిల్ల విషయంలో విమర్శించే హక్కు జగన్కు లేదన్నారు. .పవన్ విషయంపై ఆయన సతీమణులే తేల్చుకోవాల్సి ఉంటుందని…ఆ విషయమై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఇరు వర్గాలకు మంచిది కాదన్నారు.
లీడర్ ఎప్పుడూ మార్గదర్శకుడిగా ఉండాలి. తప్పు చేస్తే..తప్పు చేస్తున్నావు, ఇలా చేయొద్దని చెప్పాలి. జగన్ మాట్లాడినట్టుగా పేపర్ లో ఏదైతే వచ్చిందో..అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు. దీంట్లో రెండో ఆలోచన లేదన్నారు. పవన్ కల్యాణ్ అన్న వాడికి ఎంతమంది పెళ్లాలు ఉన్నారనేది.. ఆ పెళ్లాలే తేల్చుకోవాలి తప్ప నీకూ నాకూ సంబంధం లేదని మన చట్టం చెబుతోందన్నారు. జగన్ అలా వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీకీ మంచిది కాదన్నారు.